తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2021, 5:17 PM IST

ETV Bharat / sports

IPl 2021 news: దిల్లీ బౌలర్ల దూకుడు.. ముంబయి 129/8

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్​ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు చేసింది.

sdf
sfd

ఐపీఎల్​ 2021లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్​మెన్ తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులకు పరిమితమైంది ముంబయి.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (7) రెండో ఓవర్​లోనే పెవిలియన్ చేరాడు. తర్వాత డికాక్, సూర్య కుమార్ కాసేపు వికెట్​ను కాపాడారు. వీరిద్దరూ రెండో వికెట్​కు 29 పరుగులు జోడించాక డికాక్​ (19)ను ఔట్ చేశాడు అక్షర్ పటేల్. సౌరభ్ తివారి (15), పొలార్డ్ (6), హార్దిక్ (17) పరుగులు సాధించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల ముంబయి బ్యాట్స్​మెన్ పరుగులు తీయడంలో విఫలమయ్యారు. దీంతో 129 పరుగులకు పరిమితమైంది రోహిత్​సేన.

ABOUT THE AUTHOR

...view details