ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు 54 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో మాక్స్వెల్ (56: 37 బంతుల్లో 6X4, 3X6), కెప్టెన్ కోహ్లీ(51: 42 బంతుల్లో 3X4, 3X6) అర్ధసెంచరీలతో రాణించారు. శ్రీకర్ భరత్(32) ఫర్వాలేదనిపించాడు.
IPL 2021: ముంబయి ఇండియన్స్పై ఆర్సీబీ విజయం - Mumbai Indians won the match
ఐపీఎల్ రెండో దశలో తొలి విజయాన్ని నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరుగులు తేడాతో విజయం సాధించింది.
![IPL 2021: ముంబయి ఇండియన్స్పై ఆర్సీబీ విజయం ipl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13182423-861-13182423-1632676626670.jpg)
ఐపీఎల్
ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ(43), డికాక్(24) పరుగులు చేశారు. మిగతావారు విఫలమవడంతో రోహిత్ సేన ఓడిపోయింది.
ఇదీ చూడండి:IPL 2021: కోహ్లీ, మ్యాక్స్వెల్ మెరుపులు .. ముంబయి లక్ష్యం 166
Last Updated : Sep 26, 2021, 11:40 PM IST