దిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ ధాటిగా ఆడింది. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చాలా రోజుల తర్వాత మైదానంలో దిగిన సురేశ్ రైనా(54) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు చెన్నైకి ఓపెనర్లు షాకిచ్చారు. 7 పరుగుల స్కోరు వద్ద ఇద్దరూ ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రైనా ఆచితూచి ఆడగా, మొయిన్ అలీ నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. అనంతరం రాయుడుతో కలిసి రైనా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి 23 పరుగులు చేసిన రాయుడు, 54 పరుగులు చేసిన రైనా ఔటయ్యారు.