తెలంగాణ

telangana

By

Published : May 25, 2023, 7:13 PM IST

ETV Bharat / sports

ముంబయి గెలిస్తే.. అత్యధిక టైటిళ్లతో పాటు ఆ రికార్డు కూడా!

ఈ ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ టైటిల్​ గెలిస్తే.. అత్యధిక టైటిళ్లను సొంతం చేసుకోవడంతో పాటు మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు..

IPL 2023 Mumbai Indians
ముంబయి టైటిల్ గెలిస్తే.. ఒకటి కాదు రెండు రికార్డులు!

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023 ఆరంభంలో వరుస ఓటములు ఎదుర్కొన్న ముంబయి.. ఆ తర్వాత పుంజుకుని లీగ్​ స్టేజ్​లో రాణించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడడంతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్ చేరింది. ఇక ఎలిమినేటర్​ మ్యాచ్​లోనూ లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ను ఓడించి క్వాలిఫయర్​ 2కు చేరింది. ఇక ఇందులో గెలిస్తే తుదిపోరుకు వెళ్తుంది. అక్కడ కూడా చెన్నై సూపర్ కింగ్స్​పై గెలిస్తే.. టైటిల్​ను ముద్దాడి రికార్డుకెక్కుతుంది. అంటే ట్రోఫీకి రెండు అడుగుల దూరంలో ఉందన మాట. అభిమానులు ముంబయి గెలవాలని ఆశిస్తున్నారు.

గెలిస్తే రెండు రికార్డులు.. ఇప్పటివరకు 6 సార్లు ఫైనల్స్​ ఆడి.. ఐదు సార్లు ఛాంపియన్​గా నిలిచిన ముంబయి.. తాజా సీజన్​లోనూ గెలిస్తే.. అత్యధిక టైటిల్స్​ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అయితే దీంతో పాటు మరో విషయంలోనూ రోహిత్ సేన రికార్డుకెక్కే అవకాశముంది. అదేంటంటే.. ఐపీఎల్‌ హిస్టరీలో ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగో టీమ్​.. ట్రోఫిని ముద్దాడలేదు.

ప్లే ఆఫ్స్‌కు చేరిన ఫస్ట్ టీమ్​ మూడు సార్లు(2017, 2019, 2020) టైటిల్​ను దక్కించుకుంది. ఆ ఘనత ముంబయిదే. ఇక రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్​(2011, 2018, 2021) మూడు సార్లు, కోల్​కతా నైట్ రైడర్స్​ (2012, 2014) రెండు సార్లు, ముంబయి ఇండియన్స్​(2013, 2015) రెండు సార్లు ట్రోఫీని ముద్దాడాయి. మూడో జట్టుగా వెళ్లిన సన్​రైజర్స్​ ఒక్క సారి(2016) ఛాంపియన్​గా నిలిచింది. అయితే ఈ సీజన్‌లో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబయి.. ఒకవేళ అభిమానులు ఆశించినట్టు టైటిల్‌ గెలిస్తే మాత్రం.. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి.. ట్రోఫీని అందుకున్న ఫస్ట్​ టీమ్​గా రికార్డు కెక్కుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

కాగా, ముంబయి ఇండియన్స్‌కు మే 26న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్​తో తలపడనుంది. అందులో గెలిస్తే.. మే 28న జరిగే ఫైనల్లో చెన్నై సూపర్​ కింగ్స్​తో పోటిపడనుంది. మరి ముంబయి ఈ రెండు మ్యాచులు గెలిచి.. రికార్డును తన ఖాతాలో వేసుకుంటుందా.. లేదంటే.. ఓడి ఇంటికి వెళ్తుందో చూడాలి..

ఇకపోతే మే 25న లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (23 బంతుల్లో 41; 6x4, 1x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 2x4, 2x6) రాణించారు. అనంతరం ఆకాశ్‌ మధ్వాల్‌ మూడు ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి లఖ్​నవూను దెబ్బతీశాడు. దీంతో లఖ్​నవూ 16.3 ఓవర్లలో 101 పరుగులకే పరిమితమైంది. స్టొయినిస్‌ (27 బంతుల్లో 40; 5x4, 1x6) మినహా అందరూ ఫెయిల్ అయ్యారు.

ఇదీ చూడండి:ఎలిమినేటర్​ మ్యాచ్​ సంచలనం.. ఇంజనీర్​ నుంచి క్రికెటర్​గా.. ఎవరీ 'ఆకాశ్ మధ్వాల్‌'?

ABOUT THE AUTHOR

...view details