దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. చాలా రకాల కార్యకలాపాలు తాత్కాలికంగా వాయిదా పడటం, నిలిచిపోవడం జరుగుతున్నా ఐపీఎల్ మాత్రం బయోబబుల్లో కొనసాగుతోంది.
సురక్షితమైన వాతావరణంలో ఈ మెగాలీగ్ కొనసాగుతున్నప్పటికీ క్రికెటర్లకు మాత్రం కరోనా భయం వెంటాడుతున్నట్లుంది. ఈ కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లు లీగ్ను వీడి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారని ఓ క్రికెట్ ప్రతినిధి తెలిపారు. ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు. భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్యపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించడం కూడా వీరి భయాలకు కారణమని చెప్పారు.
జంపా, రిచర్డ్సన్ కూడా