తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2021, 7:52 AM IST

ETV Bharat / sports

ఐపీఎల్​కు అశ్విన్​ బ్రేక్​​.. కారణమిదే

తన కుటుంబం కరోనా బారిన పడిందని తెలిపిన దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​.. వారికి తోడుగా ఉండేందుకు ఈ ఐపీల్​లో​​ ​నుంచి మధ్యలోనే వైదొలుగుతున్నట్లు తెలిపాడు. పరిస్థితులు చక్కబడితే తిరిగివస్తానని చెప్పాడు.

Ashwin
అశ్విన్

దిల్లీ క్యాపిటల్స్​కు ఎదురుదెబ్బ తగిలింది. స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్​కు విరామం ప్రకటించాడు. తన కుటుంబ కరోనా బారిన పడిందని.. అందుకే వారికి తోడుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ​ తెలిపాడు. ఆదివారం సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​ జరిగాక ఈ విషయం చెప్పాడు. పరిస్థితులు చక్కబడితే తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాడు.

చెపాక్ వేదికగా జరిగిన దిల్లీ- హైదరాబాద్ మ్యాచ్ సూపర్ ఓవర్​కు దారి తీసింది. ఈ ఉత్కంఠ భరిత పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 7 పరుగులే చేయగా అనంతరం పంత్​ సేన ఆ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details