ఐపీఎల్ 16వ సీజన్లో ముంబయి ఇండియన్స్ దూకుడు కొనసాగుతోంది. తొలుత రెండు మ్యాచ్లల్లో ఘోర పరాజయాల నుంచి వేగంగా కోలుకున్న ఆ జట్టు.. హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. వరుసగా మూడు మ్యాచ్లల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. జట్టును పట్టాలెక్కించడంలో కేప్టెన్గా రోహిత్ శర్మ కీలక పాత్రను పోషించాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ముంబయి.. తొలి రెండింట్లో ఓడింది. చివరి మూడు మ్యాచ్లల్లో విజయఢంకా మోగించింది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. శనివారం తన తదుపరి మ్యాచ్ను ఆడబోతోంది. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
జోరు మీదున్న ముంబయి ఇండియన్స్కు మరో గుడ్న్యూస్ అందింది. కెప్టెన్ రోహిత్ శర్మ.. మరో బిగ్ ప్రాజెక్ట్పై సంతకం చేశాడు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీకి చెందిన రిలయన్స్ జియో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. ఇప్పటివరకు సచిన్ తెందుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, సూర్యకుమార్ యాదవ్.. రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే జాబితాలో తాజాగా రోహిత్ శర్మ కూడా చేరాడు.డిజిటల్ స్ట్రీమింగ్ యాప్కు ఇక రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తాడని జియో సినిమా మేనేజ్మెంట్ తెలిపింది. ఇప్పటికే రోహిత్ శర్మపై కొన్ని ఫొటో షూట్స్, ప్రోమోలను చిత్రీకరించింది జియో సినిమా యాజమాన్యం. వాటిని త్వరలోనే ప్రసారం చేయనుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2023 మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా టెలికాస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే.