తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో అత్యధికసార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌' వీరికే.. - అత్యధిక మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డులు

IPL 2022: ఐపీఎల్​ అంటేనే ఓ పండుగ వాతావరణం. ప్రతి ఏటా ఈ లీగ్​ కోసం ఎంతో మంది క్రికెట్​ అభిమానులు వేచి చూస్తుంటారు. ఆ క్రమంలోనే ఈ నెల 26న ఐపీఎల్ 15వ సీజన్​ ప్రారంభం కానుంది. అయితే లీగ్​ చరిత్రలో చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును ఎక్కువ సార్లు గెలుచుకున్నారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, వారి జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. ఓ సారి వారి వివరాలను పరిశీలిద్దాం.

ipl players
highest man of the match awards

By

Published : Mar 12, 2022, 12:30 PM IST

IPL 2022: ఐపీఎల్​లో పరుగుల వరద పారుతుంటుంది. క్రికెటర్లు కొత్త కొత్త షాట్లను తమ అభిమానులకు పరిచయం చేస్తుంటారు. బౌండరీలు, సిక్సులు బాదుతూ గ్రౌండంతా బంతిని పరుగులు పెట్టిస్తారు. మరోవైపు బౌలర్లు తమ పదునైన బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటారు. ఇలా తమ జట్లను గెలిపించి ఎంతో మంది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకుంటారు. మరి ఐపీఎల్‌లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం

IPL man of the match awards

ఏబీ డివిలియర్స్

ఐపీఎల్ చరిత్రలో ఏబీ డివిలియర్స్​ అత్యధిక సార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. 156 ఇన్నింగ్స్​ ఆడిన మిస్టర్ 360 ఇప్పటివరకు 23 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్​లో ఏబీడీ 151.91 స్ట్రైక్ రేటుతో 4,849 పరుగులు చేశాడు.

ఏబీ డివిలియర్స్​

క్రిస్ గేల్

విధ్వంసకర బ్యాటర్​గా పేరొందిన క్రిస్​ గేల్​ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ యూనివర్సల్ బాస్ బ్యాట్‌తో బరిలోకి దిగితే సిక్సులు, బౌండరీల వర్షం కురవాల్సిందే. ఇప్పటి వరకు గేల్ 22 సార్లు 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. 150.11 స్ట్రైక్​ రేటుతో గేల్​ 4772 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 6 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు కూడా గేల్ పేరిట ఉన్నాయి.

క్రిస్​ గేల్​

రోహిత్​ శర్మ

ఇప్పటి వరకు ఐదు సార్లు ముంబయి ఇండియన్స్‌ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 18 సార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 5,230 పరుగులు చేశాడు.

రోహిత్​ శర్మ, ఎంఎస్​ ధోనీ

ఎంఎస్ ధోనీ

బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోని మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడుతున్నాడు. సుదీర్ఘ కాలంగా ఆ జట్టుకే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు 204 మ్యాచ్‌లు ఆడిన ధోని మొత్తం 4,632 పరుగులు చేశాడు. లీగ్​ చరిత్రలో 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.

డేవిడ్​ వార్నర్​

డేవిడ్​ వార్నర్​

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొత్తం 17 సార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్నాడు. మొదటి బంతి నుంచే బౌండరీలు బాదే వార్నర్ ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు ఆడి 5,254 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇదీ చదవండి:IPL 2022: కోల్​కతా జట్టులోకి ఆసీస్ స్టార్.. ఆ ఓపెనర్​ స్థానంలో..

ABOUT THE AUTHOR

...view details