2022 Lucknow Super Gaints: ఐపీఎల్లో అడుగుపెడుతూనే లఖ్నవూ సూపర్ జెయింట్స్ సంచలనమే సృష్టించింది. సంజీవ్ గొయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ సంస్థ బిడ్డింగ్లో ఏకంగా రూ.7,090 కోట్లు చెల్లించి ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. గతంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కు యజమానిగా ఉన్న ఆర్పీఎస్జీ ఇప్పుడు లఖ్నవూ జట్టుతో మరోసారి లీగ్లో భాగమైంది. ముందుగానే కేఎల్ రాహుల్ (రూ.17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (రూ.9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.4 కోట్లు)ను ఆ జట్టు తీసుకుంది. రాహుల్కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఇక మెగా వేలంలో తమ దగ్గరున్న మొత్తం డబ్బు రూ.59 కోట్లను ఖర్చు పెట్టి మరో 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. భారీ షాట్లతో మ్యాచ్ గమనాన్ని మార్చే ఆల్రౌండ్ హిట్టర్లపై ప్రత్యేక దృష్టి సారించిన జట్టు.. హోల్డర్ (రూ.8.75 కోట్లు), కృనాల్ పాండ్య (రూ.8.25 కోట్లు), దీపక్ హుడా (రూ.5.75 కోట్లు) లను వేలంలో దక్కించుకుంది. గత కొన్ని సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న పేసర్ అవేశ్ ఖాన్ (రూ.10 కోట్లు)ను భారీ ధరకు సొంతం చేసుకుంది. వేలం జరిగే సమయానికి లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టీమ్ఇండియాకు ఆడని ఆటగాడిగా అవేశ్ రికార్డు సృష్టించాడు. ఇటీవల జాతీయ జట్టు తరపున అతను అరంగేట్రం చేశాడు. ఆ జట్టు నిలకడగా మంచి ప్రదర్శనతో కొనసాగితే ప్లేఆఫ్స్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.
బలాలు
కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు అతి పెద్ద బలం. కొన్నేళ్లుగా అతను గొప్ప ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్లలో ఉత్తమంగా రాణిస్తున్నాడు. ఈ సారి కొత్త జట్టు సారథిగా లీగ్లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా చేసిన అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. అతనితో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ప్రమాదకర డికాక్ ఉండడం వల్ల ఓపెనింగ్ జోడీ కుదిరింది. ఇక ఆల్రౌండర్లు ఆ జట్టుకు మరో బలం. హోల్డర్, కృనాల్ పాండ్య, దీపక్ హుడా, స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్.. ఇలా జట్టుకు కావాల్సిన స్థాయిలో ఆల్రౌండర్ల దన్ను ఉంది. క్షణాల్లో పరిస్థితి తారుమారయ్యే టీ20ల్లో జట్టు విజయాల్లో ఆల్రౌండర్లది కీలక పాత్ర. ఇటీవల టీమ్ఇండియా తరపున అరంగేట్రం చేసిన స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అవేశ్ఖాన్ బౌలింగ్లో జట్టుకు భరోసానిస్తున్నారు. బిష్ణోయ్తో పాటు కృనాల్, దీపక్, కృష్ణప్ప ఉండడం వల్ల స్పిన్ బౌలింగ్లో వైవిధ్యం జట్టుకు కలిసొచ్చే అంశం.
బలహీనతలు