తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: కెప్టెన్‌లుగా రాహుల్‌, హార్దిక్‌ పాండ్య

IPL 2022: లఖ్​నవూ సారథిగా కేఎల్ రాహుల్, అహ్మదాబాద్​ కెప్టెన్​గా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆటగాళ్ల ఎంపికను పూర్తిచేశాయి కొత్త జట్లు.

By

Published : Jan 22, 2022, 6:44 AM IST

IPL 2022
ఐపీఎల్

IPL 2022: ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలు వేలానికి ముందు ఆటగాళ్ల ఎంపికను పూర్తిచేశాయి. అహ్మదాబాద్‌కు హార్దిక్‌ పాండ్య, లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అహ్మదాబాద్‌.. హార్దిక్‌, రషీద్‌ ఖాన్‌ కోసం రూ.15 కోట్ల చొప్పున వెచ్చించింది. శుభ్‌మన్‌గిల్‌ను ఆ ఫ్రాంచైజీ రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది.

లఖ్‌నవూ రాహుల్‌ కోసం రూ. 17 కోట్లు ఖర్చు చేసింది. స్టాయినిస్‌ను రూ.9.2 కోట్లకు, రవి బిష్ణోయ్‌ను రూ.4 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఈ వేలం ప్రక్రియ జరగనుంది.

ఇక దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ వేదికపై సందిగ్ధత నెలకొంది. దక్షిణాఫ్రికా లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details