IPL 2022: ఎప్పుడో గౌతమ్ గంభీర్ (2012, 2014) కెప్టెన్గా ఉన్నప్పుడు కోల్కతా నైట్రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. గతేడాది ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కేకేఆర్ ఫైనల్కు చేరినా మూడోసారి అదృష్టం వరించలేదు. అయితే, అప్పుడు కీలకంగా ఉన్న శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు ఇప్పుడు లేరు. వ్యక్తిగతంగా రాణించకపోయినా జట్టును నడిపించడంలో విజయవంతమైన మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తిక్ను ఈసారి తీసుకోలేదు. అయితే, గతేడాది ఫామ్లో లేని ఆండ్రూ రస్సెల్ను మరోసారి రిటెయిన్ చేసుకున్న కేకేఆర్.. సునిల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిని కూడా అట్టిపెట్టుకుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కాస్త బలహీనంగానే కనిపిస్తోంది.
ఇంకా కీలకమైన ఆటగాళ్లెవరంటే?
శ్రేయస్ అయ్యర్ను రూ. 12.50 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసుకొని సారథ్య బాధ్యతలను అప్పగించింది. 2020 ఐపీఎల్ సీజన్లో దిల్లీని ఫైనల్కు చేర్చిన చరిత్ర ఉంది. గత కొన్ని రోజులుగా ఫామ్ను చూసుకుంటే శ్రేయస్ పీక్స్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో మూడు మ్యాచ్ల్లోనూ అర్ధశతకాలు బాదాడు. అందుకేనేమో కేకేఆర్ యాజమాన్యం శ్రేయస్ను ఎంచుకుంది. శ్రేయస్ అయ్యర్ కాకుండా జట్టులో వెంకటేశ్ అయ్యర్, రస్సెల్, చమిక కరుణరత్నె, సునిల్ నరైన్, నితీశ్ రాణా, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ నబీ, అంజిక్య రహానె బాగా సుపరిచితులు.
బ్యాటింగ్లో ఆదుకునేది..!