ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. దిల్లీతో మ్యాచ్లో ఒత్తిడి కంటే ఉత్సాహంతోనే ఆడినట్లు చెప్పాడు. జట్టును గెలిపించాలనే లక్ష్యంతో మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపైనే తాను దృష్టి సారించినట్లు వెల్లడించాడు.
"తొలి మ్యాచ్లో మొదట కాస్త ఒత్తిడిగా అనిపించినా, తర్వాత ఎంతో ఉత్సాహంతో ఆడాను. మెరుగైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నాను. ఈ ఐపీఎల్లో మా జట్టు బాగా రాణిస్తుందని ఆనుకుంటున్నాను"