తెలంగాణ

telangana

ఆర్సీబీ.. గతేడాది ఆ తప్పిదాలు చేసింది!

By

Published : Sep 26, 2020, 9:54 PM IST

Updated : Sep 26, 2020, 10:23 PM IST

చేతికి చిక్కిన క్యాచ్​లను ఈ సీజన్​లోనే కాకుండా గత ఐపీఎల్​లోనూ వదిలేసింది బెంగళరు జట్టు. దీనివల్ల కొన్నిసార్లు ఓడిపోవాల్సి వస్తోంది.

Virat Kohli
కోహ్లీ

పంజాబ్​తో మ్యాచ్​లో బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లీ, రెండు క్యాచ్​లను వదిలేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్యాచులే ఓటమికి ప్రధాన కారణమని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయితే కోహ్లీసేనకు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి తప్పులతో ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి!

గత సీజన్​లోని తొలి ఆరు మ్యాచుల్లో పేలవమైన ఫీల్డింగ్​తో ఏకంగా పదిహేను క్యాచ్​లను వదిలేశారు ఆర్సీబీ ఫీల్డర్లు. దీంతో ఇప్పటికీ పలు సందర్భాల్లో అవి చర్చకు వస్తూనే ఉంటాయి.

మరోవైపు బెంగళూరు బలమైన బ్యాటింగ్​ లైనప్​ ఉందనే కానీ.. స్టార్​ ఆటగాళ్లు కోహ్లీ, డివీలియర్స్.. అందులో విఫలమై​ చాలాసార్లు ఫ్రాంచైజీ ఆగ్రహానికి గురయ్యారు. అందువల్ల ఈ సారైనా ప్రారంభంలోనే తప్పిదాలు సరిదిద్దుకుని ఆటను కొనసాగిస్తే గానీ.. ఎక్కువ మ్యాచులు గెలవడం వీలుకాదు!

ఇదీ చూడండి ఐపీఎల్​లో 'టాస్' లెక్క తప్పుతోంది!

Last Updated : Sep 26, 2020, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details