రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ (61), క్రిస్ గేల్ (53), అర్ధ శతకాలతో రెచ్చిపోయి జట్టుకు రెండో విజయాన్ని అందించారు. చివరి ఓవర్లో రెండు పరుగులు చేయాల్సిన క్రమంలో పంజాబ్ సునాయాస విజయం సాధిస్తుంది అని భావిస్తే అంచనాలు తలకిందులయ్యాయి.
పంజాబ్ జి'గేల్'.. ఆర్సీబీపై ఘనవిజయం - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్క్వాడ్ టుడే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. దీంతో రాహుల్సేన టోర్నీలో రెండో గెలుపును నమోదు చేసుకుంది. అయితే ప్రస్తుత ఐపీఎల్లో పంజాబ్ సాధించిన రెండు విజయాలు ఆర్సీబీ టీమ్పైనే కావడం విశేషం.
పంజాబ్ జి'గేల్'.. ఆర్సీబీపై ఘనవిజయం
ఆర్సీబీ స్పిన్నర్ చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్ల మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. తొలి రెండు బంతులు డాట్ బాల్స్ పడగా.. మూడో బంతికి గేల్ సింగిల్ తీశాడు. ఇక నాలుగో బంతికి రాహుల్ పరుగు చేయలేక ఐదో బంతికి షాట్ ఆడి పరిగెత్తాడు. అయితే, గేల్ పరుగులో వేగం తగ్గడం వల్ల రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీస్తుందేమో అనే సందేహం ఏర్పడింది. కానీ, చివరి బంతికి పూరన్(6) సిక్సర్ బాదడం వల్ల పంజాబ్ ఊపిరి పీల్చుకుంది.