తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టీవ్​ స్మిత్​కు రూ.12 లక్షల జరిమానా

రాజస్థాన్ రాయల్స్​​ జట్టు కెప్టెన్​ స్టీవ్​ స్మిత్​​కు రూ. 12 లక్షలు జరిమానా పడింది. మంగళవారం ముంబయి ఇండియన్స్​​తో జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్​ రేటు కారణంగా అతడిపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఐపీఎల్​ నిర్వాహకులు.

By

Published : Oct 7, 2020, 7:29 AM IST

Updated : Oct 7, 2020, 11:48 AM IST

Steven Smith
స్టీవ్​ స్మిత్

ముంబయి ఇండియన్స్​ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్​కు మరో షాక్​ తగిలింది. ఆ జట్టు సారథి స్టీవ్​ స్మిత్​కు రూ.12 లక్షలు జరిమానా పడింది. స్లో ఓవర్​ రేట్​ కారణంగా.. ఈ చర్యలు తీసుకున్నట్లు లీగ్ నిర్వాహకులు తెలిపారు.

అబుదాబి వేదికగా మంగళవారం ముంబయి, రాజస్థాన్​ తలపడ్డాయి. టాస్​ గెలిచి తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సూర్యకుమార్​ యాదవ్​(79*) అజేయ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్​ 136 పరుగులకే కుప్పకూలింది. బట్లర్​(70) పోరాటం వృథా అయ్యింది. స్మిత్​ సేనను తన బౌలింగ్​తో బుమ్రా(4/20) దెబ్బతీశాడు.

Last Updated : Oct 7, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details