తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ.. ఒక్క ఫోర్​కే సెలబ్రేషన్ అవసరమా? - కోహ్లీపై ట్రోల్స్

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో కోహ్లీ చేసుకున్న సెలబ్రేషన్ అతడిపై ట్రోలింగ్​కు కారణమైంది.

Netizens troll RCB captain Kohli after fiist boundary celebration
కోహ్లీ.. ఒక్కదానికే సెలబ్రేషన్ అవసరమా?

By

Published : Oct 13, 2020, 5:04 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మరోసారి నెటిజన్లకు చిక్కాడు. దీంతో అతడిపై ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​ సందర్భంగా కోహ్లీ ఫోర్ కొట్టిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. దీంతో విమర్శల పాలయ్యాడు. అందులో తప్పేముంది అంటారా! అయితే అసలేం జరిగిందో చూడండి.

అసలేం జరిగింది!

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో కెప్టెన్ కోహ్లీ 28 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క ఫోర్ ఉంది. అది కూడా అతనాడిన 25వ బంతికి వచ్చింది. అయితే దాన్ని కూడా కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు.

"కోహ్లీ.. నువ్వు కొట్టింది ఒక్క ఫోర్​. దానికి అంత సెలబ్రేషన్ అవసరమా?" అంటూ ఒకరు ట్రోల్ చేయగా, "డివిలియర్స్ అన్ని సిక్సులు, ఫోర్లు కొట్టాడు. అయినా సింపుల్​గా ఉన్నాడు. మరి కోహ్లీ ఒక్క ఫోర్​కే అంత రియాక్షన్ ఏంటి?" అంటూ మరొకరు కామెంట్ చేశారు. "ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతి ఆఫ్ సైడ్ బయటకు వెళ్లడం వల్ల ఫోర్ వచ్చింది. ఇందులో కోహ్లీ సాధించిందేమీ లేదు" అంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details