తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీపై విమర్శలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది' - syed kirmani reacts on dhoni performance

ధోనీ ఐపీఎల్​ ప్రదర్శనపై విమర్శలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుందని మాజీ వికెట్ కీపర్​ కిర్మాణీ చెప్పారు. మహీని ఓ మాట అనేముందు అతడు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలని విమర్శకులకు సూచించాడు.

Dhoni
ధోనీ

By

Published : Oct 12, 2020, 1:51 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​ ప్రారంభం నుంచి చెన్నై సూపర్​కింగ్స్ సారథి ధోనీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్​ బ్యాట్స్​మన్ సయ్యద్​ కిర్మాణీ.. విమర్శించే వారిపై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. వారిని చూస్తుంటే జాలి వేస్తుందని అన్నాడు. టీమ్​ఇండియాకు మహీ అందించిన సేవలను ఎన్నటికీ మర్చిపోకూడదని గుర్తు చేశాడు.

సయ్యద్​ కిర్మాణీ

"కెరీర్​లో ప్రతి ఆటగాడు ఒకానొక సమయంలో ఎలా విజృంభిస్తాడో అలానే పేలవమైన ప్రదర్శన చేస్తాడు. కాలంతో పాటు పరిస్థితులు మారుతుంటాయి. అన్ని రోజులు ఓకేలా ఉండవు. ధోనీ పరిస్థితి కూడా అంతే. ఓ గొప్ప ఆటగాడి ప్రదర్శన కొంచెం తగ్గినంత మాత్రాన విమర్శించడం సరికాదు. విమర్శలు చేసేవారిని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. ధోనీ విజయాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అతడు ఉత్తమమైన ఫినిషర్​. చాలా కాలం తర్వాత మళ్లీ బ్యాట్​ పట్టుకోవడం ఈ ఐపీఎల్​లో అతడి ప్రదర్శన కొంచెం తగ్గింది. యువ ఆటగాళ్లతో పోలిస్తే వయసు పైబడిన క్రికెటర్ల ఆటతీరు కొంచెం పట్టు తగ్గడం సహజం. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచనలతో వారు సతమతమవుతుంటారు. ఇంకా అనేక సమస్యలుంటాయి. ఇవి మీకు తెలియదు. కాబట్టి మనమందరం వారి పరిస్థితిని తప్పుపట్టకూడదు, అంగీకరించాలి"

-సయ్యద్​ కిర్మిణీ, టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్​,బ్యాట్స్​మన్​

గతేడాది ప్రపంచకప్ సెమీ​ఫైనల్​లో న్యూజిలాండ్​పై చివరి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడు ధోనీ. ఆ తర్వాత ఏడాది పాటు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఇటీవలే పంద్రాగస్టున అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. దీంతో ఏడాది కాలంగా అతడి ఆట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులకు ఈ ఐపీఎల్​లో పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు మహీ. ఫలితంగా విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

ఇదీ చూడండి పంత్​కు గాయం.. వారం రోజుల విశ్రాంతి: అయ్యర్,

ABOUT THE AUTHOR

...view details