తెలంగాణ

telangana

By

Published : Sep 24, 2020, 11:07 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ETV Bharat / sports

ఒకే మ్యాచ్​లో రోహిత్ డబుల్ ధమాకా

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్ శర్మ రెండు ఘనతల్ని తన పేరు మీద లిఖించుకున్నాడు. టోర్నీలో 200 సిక్సర్లు బాదిన మైలురాయిని చేరుకోవడం సహా.. ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్​గా సరికొత్త రికార్డు సృష్టించాడు.

KKR vs MI: Rohit Sharma becomes 4th batsman to hit 200 sixes in IPL
ఒకేమ్యాచ్​లో రెండు ఘనతలను సాధించిన హిట్​మ్యాన్​

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఈ గెలుపులో ముంబయి సారథి రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్​ ప్రారంభంలోనే ఓపెనర్ డికాక్​ వికెట్​ కోల్పోయింది. ఆ తర్వాత సూర్యకుమార్​ యాదవ్​తో కలిసి రోహిత్ శర్మ.. కెప్టెన్​ ఇన్నింగ్స్​తో చెలరేగాడు. ఈ క్రమంలో సరికొత్త ఘనతల్ని సాధించాడు హిట్​మ్యాన్​.

200వ సిక్సర్ల మైలురాయి

ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్​ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. లీగ్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. తొలి మూడు స్థానాల్లో గేల్‌ (316), ఏబీ డివిలియర్స్‌ (214), ధోనీ (212) ఉన్నారు.

రోహిత్‌ నయా రికార్డు

లీగ్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. కోల్‌కతాపై అతడు 875 పరుగులు సాధించాడు. అతడి తర్వాత స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ (829) ఉన్నాడు. వార్నర్‌ కూడా ఇదే జట్టుపై సాధించడం విశేషం.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details