తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2020, 3:59 PM IST

Updated : Oct 15, 2020, 6:01 PM IST

ETV Bharat / sports

'తాహిర్.. రియల్ ఛాంపియన్ ఆఫ్ క్రికెట్'

గతేడాది ఐపీఎల్​లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు చెన్నైసూపర్ కింగ్స్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. కానీ ఈ సీజన్​లో మాత్రం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​ కూడా అతడికి ఆడే అవకాశం ఇవ్వలేదు. దీంతో చెన్నై యాజమాన్యంపై అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయమై తాహిర్ స్వయంగా స్పందించాడు.

Imran Tahir
తాహిర్

గతేడాది టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా లెగ్‌ స్పిన్నర్‌, ప్రస్తుత చెన్నై బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ తాజా లీగ్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మైదానంలోని తమ జట్టు ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందిస్తున్నాడు. తాహిర్‌ను మైదానం వెలుపల ఉంచడంపై సోషల్‌ మీడియాలో చర్చ జరగడం వల్ల అతడు ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

"గ్రౌండ్‌ లోపల నేనున్నప్పుడు చాలామంది ఆటగాళ్లు నా కోసం డ్రింక్స్‌ తెచ్చేవాళ్లు. ఇప్పుడు నేను వాళ్లకిస్తున్నాను. అది నా పని. ఇప్పుడు నేను ఆడుతున్నానా? లేదా? అన్నది ముఖ్యం కాదు. నేను జట్టు కోసం పని చేస్తున్నానా? లేదా? అన్నదే కావాలి. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా ఆడతాను. అయితే, జట్టు గెలుపే నాకు ముఖ్యం."

-తాహిర్, సీఎస్కే ఆటగాడు

దీంతో పలువురు క్రికెట్‌ అభిమానులు తాహిర్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన ఆటగాడు అంటే ఇలా ఉండాలి, రియల్‌ ఛాంపియన్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Last Updated : Oct 15, 2020, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details