ఐపీఎల్లో ఇప్పటివరకు ప్రదర్శన పరంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, దిల్లీ క్యాపిటల్స్ అంతగా ఆదరణ లేని జట్లుగా నిలిస్తూ వచ్చాయి. అయితే, ఆదివారం ఈ రెండు జట్ల మధ్య పోరు అభిమానులకు పసందైన వినోదాన్ని అందించింది. సూపర్ ఓవర్తో ఫలితం తేలిన ఈ మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకు పరిమితమయ్యేలా కనిపించిన జట్టుకు స్టోయినిస్ 53 పరుగులతో ఊహించని స్కోరునందించాడు.
స్టోయినిస్ బ్యాటింగ్ అదుర్స్.. ఆర్సీబీపై ట్రోల్స్! - latset ipl news updates
ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ గెలుపులో స్టోయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. ఆదేంటి?.. ఆర్సీబీపై ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా. మీరే చూడండి.

అనంతరం ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్.. తడబడి నిలబడి చివరకు మ్యాచ్ను డ్రావైపు తీసుకెళ్లింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో రబాడా బౌలింగ్ ధాటికి కుప్పకూలింది పంజాబ్ జట్టు. ఎంతో సునాయాసంగా దిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. బ్యాటుతో, బంతితో మ్యాచ్ను మలుపు తిప్పిన స్టోయినిస్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. అయితే, దిల్లీ జట్టు విజయంతో ఆర్సీబీపై ట్విట్టర్లో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అదేంటి అనుకుంటున్నారా?. అందుకు కారణం స్టోయినిస్ ప్రదర్శన.
గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున స్టోయినిస్ ఆడాడు. కానీ ఈసారి అతడిని వదులుకుంది బెంగళూరు. ఈ సీజన్లో దిల్లీ అతడ్ని కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ అద్భుత బ్యాట్స్మన్ను కోల్పోయిందంటూ సోషల్మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ రియాక్షన్ ఇదేనంటూ ట్రోల్స్ చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం.