తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టోయినిస్ బ్యాటింగ్​ అదుర్స్​.. ఆర్సీబీపై ట్రోల్స్​! - latset ipl news updates

ఆదివారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ జట్టుపై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ గెలుపులో స్టోయినిస్​ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుపై నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. ఆదేంటి?.. ఆర్సీబీపై ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా. మీరే చూడండి.

IPL 2020
స్టాయినిస్​

By

Published : Sep 21, 2020, 2:04 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఐపీఎల్​లో ఇప్పటివరకు ప్రదర్శన పరంగా కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​, దిల్లీ క్యాపిటల్స్​ అంతగా ఆదరణ లేని జట్లుగా నిలిస్తూ వచ్చాయి. అయితే, ఆదివారం ఈ రెండు జట్ల మధ్య పోరు అభిమానులకు పసందైన వినోదాన్ని అందించింది. సూపర్ ఓవర్​తో ఫలితం తేలిన ఈ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్​ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకు పరిమితమయ్యేలా కనిపించిన జట్టుకు స్టోయినిస్​ 53 పరుగులతో ఊహించని స్కోరునందించాడు.

అనంతరం ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్​.. తడబడి నిలబడి చివరకు మ్యాచ్​ను డ్రావైపు తీసుకెళ్లింది. ఆ తర్వాత సూపర్ ఓవర్​లో రబాడా బౌలింగ్​ ధాటికి కుప్పకూలింది పంజాబ్​ జట్టు. ఎంతో సునాయాసంగా దిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. బ్యాటుతో, బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పిన స్టోయినిస్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. అయితే, దిల్లీ జట్టు విజయంతో ఆర్సీబీపై ట్విట్టర్​లో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అదేంటి అనుకుంటున్నారా?. అందుకు కారణం స్టోయినిస్​ ప్రదర్శన.

గతంలో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున స్టోయినిస్​ ఆడాడు. కానీ ఈసారి అతడిని వదులుకుంది బెంగళూరు. ఈ సీజన్​లో దిల్లీ అతడ్ని కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ అద్భుత బ్యాట్స్​మన్​ను కోల్పోయిందంటూ సోషల్​మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది స్టోయినిస్​ బ్యాటింగ్​ చేస్తున్నప్పుడు కోహ్లీ రియాక్షన్​ ఇదేనంటూ ట్రోల్స్​ చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details