ఐపీఎల్లో ఆటగాళ్లకు గాయల బెడత తప్పట్లేదు. దిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు, శుక్రవారం రాజస్థాన్తో మ్యాచ్లో తొడ కండరాలు పట్టేశాయి. అయితే పంత్కు సమస్యేం లేదని, వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యుడు చెప్పినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
పంత్కు గాయం.. వారం రోజుల విశ్రాంతి: అయ్యర్ - IPL LATEST NEWS
యువ వికెట్ కీపర్ పంత్కు తొడ కండరాలు పట్టేశాయని, వారం రోజుల పాటు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.
పంత్కు గాయం.. వారం రోజుల విశ్రాంతి: అయ్యర్,
ముంబయి-దిల్లీ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో పంత్ బదులుగా క్యారీ కీపింగ్ చేశారు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ముంబయి విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది ముంబయి. అయితే మరో 10-15 పరుగులు చేసుంటే బాగుండేదని క్యాపిటల్స్ కెప్టెన్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు.
Last Updated : Oct 12, 2020, 12:34 PM IST