ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు మైదానంలో ఆకుపచ్చ రంగు జెర్సీల్లో కనిపించనున్నారు. చెన్నైతో ఆదివారం జరిగే మ్యాచ్లో ఈ దుస్తులతో బరిలో దిగనున్నారు. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు ఫ్రాంచైజీ ఓ వీడియోను ట్వీట్ చేసింది.
గ్రీన్ జెర్సీల్లో ఆర్సీబీ క్రికెటర్లు.. ఎందుకంటే? - IPL LATEST NEWS
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ జెర్సీతో దర్శనమివ్వనున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్సీబీ గ్రీన్ జెర్సీ
ఇప్పటికే 14 పాయింట్లతో దూకుడు మీదున్న ఆర్సీబీ.. చెన్నైపై గెలిస్తే ఫ్లేఆఫ్స్లో దాదాపుగా చోటు దక్కించుకుంటుంది. ఫుల్ఫామ్లో ఉన్న కోహ్లీసేనకు ఇదేమంతా పెద్ద కష్టం కాకపోవచ్చు. చెన్నై ఏమైనా అద్భుతం చేస్తే తప్ప ఫలితం మారడం అసాధ్యం!
ఇది చదవండి:డివిలియర్స్ మాములోడు కాదు: కోహ్లీ