తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెంగళూరు-పంజాబ్ మ్యాచ్​లో డీన్ జోన్స్​కు నివాళి

బెంగళూరు-పంజాబ్ మ్యాచ్​లో డీన్ జోన్స్​కు నివాళిగా క్రికెటర్లందరూ చేతికి నల్లబ్యాండ్​లు ధరించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకమండలి అధికారి చెప్పారు.

By

Published : Sep 24, 2020, 7:26 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

RCB and KXIP players to wear black armbands in Dean Jones' honour
బెంగళూరు-పంజాబ్ మ్యాచ్​

ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ ఆకస్మిక మృతికి సంతాపంగా బెంగళూరు-పంజాబ్ క్రికెటర్లు నివాళి అర్పించనున్నారు. దుబాయ్ వేదికగా గురువారం జరిగే మ్యాచ్​లో చేతికి నల్లని బ్యాండ్​లు కట్టుకోనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకమండలి అధికారి వెల్లడించారు.

ఐపీఎల్ వ్యాఖ్యాతగా ఉన్న డీన్.. ముంబయిలో ప్రస్తుతం ఓ హోటల్​లో ఉండి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచారు. ఈయన్ను స్వస్థలానికి చేర్చే విషయమై ఆస్ట్రేలియా హై కమీషన్​తో స్టార్ ఇండియా చర్చలు జరుపుతోంది.

ఈయన మృతికి సంతాపం తెలుపుతూ ఇప్పటికే సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, రవిశాస్త్రితో పాటు పలువురు సంతాపం తెలిపుతున్నారు. డీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details