మ్యాచ్ గెలుపులో బ్యాట్స్మన్ ఎంత ముఖ్యమో బౌలర్ కూడా అంతే కీలకం. స్పిన్నర్లకు ఉన్న పాధాన్యత చాలా ఎక్కువ. ఐపీఎల్లో గత సీజన్ల గణాంకాలను పరిశీలిస్తే, ఎక్కువగా వికెట్లు పడగొట్టిన మొదటి ముగ్గురు బౌలర్లలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉన్నారు. దీన్నిబట్టి టీ20 ఫార్మాట్లో లెగ్ స్పిన్నర్లు గుర్తింపు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సీజన్లో దిల్లీతో మ్యాచ్లో ఆర్సీబీ స్విన్నర్ చాహల్ కాస్త నిరాశపరిచినప్పటికీ.. అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. రబాడా(12) పర్పుల్ క్యాప్తో కొనసాగుతున్నాడు.
ముంబయి ఇండియన్స్ బౌలర్ రాహుల్ చాహర్(ఐదు మ్యాచ్ల్లో 7 వికెట్లు), సీఎస్కే స్పిన్నర్ చావ్లా(ఐదు మ్యాచ్ల్లో 6 వికెట్లు), సన్రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్(ఐదు మ్యాచ్ల్లో 5 వికెట్లు).. టాప్ 20 మందిలో చోటు దక్కించుకున్నారు. మైదానం పెద్దగా ఉందనే అవగాహనకు వస్తే, స్పిన్నర్లు మరింత విశ్వాసంతో బౌలింగ్ చేయొచ్చని భారత మాజీ లెగ్ స్పిన్నర్ నరేంద్ర పిర్వానీ అభిప్రాయపడ్డారు.