తాను గతంలో ఉన్న వ్యక్తిని కాదని, చాలా మారానని చెప్పాడు టీమ్ఇండియా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ మహమ్మద్ షమి. 2015, 2018లో గాయపడినప్పుడు, ఇకపై షమి ప్రమాదకర బౌలర్ కాలేడంటూ వార్తలు రాశారని, దాంతో ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం వన్డేలు, టెస్టుల్లో భారత అగ్రశ్రేణి బౌలర్గా ఇతడు కొనసాగుతున్నాడు.
"2015, 2018లో గాయాలపాలైనప్పుడు నా కెరీర్ ముగిసిందని మీడియా రాసింది. ఒకవేళ తిరిగి మైదానంలో అడుగుపెట్టినా సరే మునుపటిలా ఆడలేనని తేల్చింది. అవును వాళ్లు చెప్పినట్లే నేను పాత వ్యక్తిని కాదు. వారు చేసిన ఆ వ్యాఖ్యలు నాలో చాలా మార్పు తీసుకొచ్చాయి" -మహమ్మద్ షమి, సీనియర్ పేసర్
95 కిలోలు ఉన్నా.. రిటైర్మెంట్ అన్నారు!