తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2020, 5:46 AM IST

Updated : Oct 20, 2020, 7:28 AM IST

ETV Bharat / sports

'ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్లో ఇకమేం లేనట్లే'

అబుదాబి వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై జట్టు ఓటమిపాలైంది. దీనిపై స్పందించిన సీఎస్కే జట్టు కెప్టెన్​ ధోని.. ఈ సీజన్​ ఫైనల్లోకి చేరుకోలేమంటూ విచారం వ్యక్తం చేశాడు.

Dhoni_CSK
'ఈ సీజన్​ ఫైనల్లో ఇకమేం లేనట్లే'

రాజస్థాన్​ జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్​లో ఓటమిపాలైంది సీఎస్కే. ఐతే, ప్రతి మ్యాచ్ అనుకున్న విధంగా ఉండదని చెన్నె సూపర్​ కింగ్స్ కెప్టెన్​ ధోనీ అన్నాడు. బౌలింగ్​ విషయంలో ఆచితూచి అడుగేసినా దాని పరిణామం భిన్నంగా ఉందని పేర్కొన్నాడు. ఈ సీజన్​లో ఫైనల్​కు చేరుకోలేమంటూ విచారం వ్యక్తం చేశాడు.

" ఒక పద్ధతిని అనుసరించే క్రమంలో కొన్ని తప్పిదాలు జరిగాయి. కానీ, దీని వల్ల పాజిటివ్​గా ఆలోచించే శక్తి పెరుగుతుంది. వేల మంది ప్రజల ముందు మేం ఆడుతున్నాం కాబట్టి ఏదీ దాచాల్సిన పనిలేదు. ముందుగా ఆటగాడికి అవకాశం ఇవ్వాలి. తను బాగా రాణించకపోతే తన స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలి. అంతేగాని ఆటగాడిలో అభద్రతా భావం కల్పించకూడదు ".

-ఎంఎస్ ధోని, చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు కెప్టెన్

'కుర్రాళ్లకు మంచి అవకాశం'

రానున్న మ్యాచ్​ల్లో యువ ఆటగాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయని ధోని అన్నాడు. ఒత్తిడి పెంచకుండా.. ఎక్కువ అవకాశాలు కల్పిస్తే యువ ఆటగాళ్లలో మెరుగైన ఆటగాళ్లు బయటపడతారని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:ఆ రికార్డు సాధించిన తొలి క్రికెటర్​గా ధోనీ

Last Updated : Oct 20, 2020, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details