ఈ ఐపీఎల్లో దిల్లీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలుత హైదరాబాద్ చేతిలో, తర్వాత ముంబయి(ఆదివారం మ్యాచ్) చేతిలో మట్టికరిచింది. దీంతో ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు, 2 ఓటములతో 10 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఓ అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
శనివారం కోల్కతా చేతిలో ఓటమి పాలైన పంజాబ్.. లీగ్ చరిత్రలో మొత్తం 100 మ్యాచ్లు ఓడిన తొలి జట్టుగా చెత్త రికార్డు సృష్టించింది. ముంబయి చేతిలో ఆదివారం భంగపడ్డ దిల్లీ.. అదే అవసరం లేని ఘనతను తన పేరిట నమోదు చేసుకుంది. దీంతో టోర్నీలో 100 మ్యాచ్ల్లో ఓడిన రెండో జట్టుగా అవతరించింది.