తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో మరో రికార్డుపై కన్నేసిన ధోనీ

సీఎస్కే కెప్టెన్ ధోనీ.. సరికొత్త రికార్డు నెలకొల్పనున్నాడు. ఐపీఎల్​లో ఎక్కువ మ్యాచ్​లు ఆడిన క్రికెటర్​గా నిలవనున్నాడు.​

By

Published : Oct 19, 2020, 3:55 PM IST

CSK captain MS Dhoni set to become first player to play 200 matches in IPL
ధోనీ

ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ సిద్ధమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్​తో సోమవారం జరిగే మ్యాచ్​తో, ఈ టోర్నీలో 200 మ్యాచ్​లు ఆడిన తొలి క్రికెటర్​గా నిలవనున్నాడు.

2008 నుంచి చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్​గా ఉన్న ధోనీ.. 2015 వరకు ప్రతి మ్యాచ్ ఆడాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ జట్టుపై రెండేళ్లు(2016-17) నిషేధం విధించిన సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున 30 మ్యాచ్​లు ఆడాడు.

ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై జట్టు.. ప్రతి సీజన్​లో ఫ్లే ఆఫ్స్​కు అర్హత సాధించింది. మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. గతేడాది ఫైనల్లో ముంబయి చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. లీగ్​లో మొత్తంగా 4,568 పరుగులు చేసిన ధోనీ.. చెన్నై తరఫున 169 మ్యాచ్​లాడి 102 సార్లు జట్టును గెలిపించాడు.

ఎక్కువ మ్యాచ్​లు ఆడిన క్రికెటర్లు

ఐపీఎల్​లో ఎక్కువ మ్యాచ్​లు ఆడిన వారిలో ధోనీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(197) ఉన్నాడు. అనంతరం రైనా 193, దినేశ్ కార్తిక్ 191 మ్యాచ్​లతో కొనసాగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details