తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేదార్​ జాదవ్​కు గాయం.. ప్లేఆఫ్​కు డౌటే

ప్రపంచకప్​కు ముందు టీమిండియాకు ఆందోళన కలిగించే వార్త. ఐపీఎల్​లో ఆదివారం పంజాబ్​తో మ్యాచ్​లో బంతిని ఆపబోయిన కేదార్ జాదవ్..​ భుజం నొప్పి కారణంగా మైదానాన్ని వీడాడు. ప్లే ఆఫ్​ మ్యాచుల్లో అతడు ఆడతాడో లేదో సోమవారం తెలుస్తుంది.

By

Published : May 5, 2019, 11:27 PM IST

జాదవ్​కు గాయం.. ప్రపంచకప్​కు పాల్గొంటాడా..?

ఐపీఎల్​లో చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కేదార్ జాదవ్. ఆదివారం పంజాబ్​తో మ్యాచ్​లో బౌండరీ వెళుతున్న బంతిని ఆపే క్రమంలో భుజం నొప్పి కారణంగా మైదానాన్ని వీడాడు. ప్లేఆఫ్​ మ్యాచ్​లో కేదార్​ పాల్గొనేది లేనిది సోమవారం తెలియనుంది.

"అతడికి ఎక్స్​రే తీసిన తర్వాతే ఏమైందనేది తెలుస్తుంది. జాదవ్​కు పెద్ద గాయమేమి కాకుడదని మేం కోరుకుంటున్నాం." - స్టీఫెన్ ఫ్లెమింగ్, చెన్నై హెడ్ కోచ్

ప్రపంచకప్​కు ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ఈ సమయంలో జాదవ్ గాయపడడం కొంచెం ఆందోళన కలిగించే అంశం.

ABOUT THE AUTHOR

...view details