తెలంగాణ

telangana

ETV Bharat / sports

ట్రైల్​బ్లేజర్స్​పై వెలాసిటీదే పైచేయి - వెలాసిటీ

స్మృతి మంధాన 'ట్రైల్​బ్లేజర్స్'పై మిథాలీ వెలాసిటీ జట్టు జయకేతనం ఎగురవేసింది. 113 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ఛేదించింది. దీప్తి శర్మ 4 వికెట్లు తీసినా ట్రైల్​బ్లేజర్స్​ను గెలిపించలేకపోయింది.

ట్రైల్​బ్లేజర్స్​పై వెలాసిటీదే పైచేయి

By

Published : May 8, 2019, 7:10 PM IST

జైపూర్​లో జరిగిన మహిళా టీ20 మ్యాచ్​లో మిథాలీరాజ్ నాయకత్వం వహించిన వెలాసిటీ జట్టు విజయం సాధించింది. ప్రత్యర్థి ట్రైల్​బ్లేజర్స్ నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగలుండగానే ఛేదించింది. డేనియల్ వ్యాట్ 46, షెఫాలీ వర్మ 34 పరుగులతో ఆకట్టుకున్నారు.

పాయింట్ల పట్టికలో తలో విజయంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి ఈ రెండు జట్లు. రేపు రాత్రి సూపర్​నోవాస్, వెలాసిటీ మ్యాచ్​తో ఫైనల్​లో ఏ జట్లు పోటీపడతాయన్న విషయం తేలిపోతుంది.

113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది వెలాసిటీ జట్టు. ఓపెనర్​ హేలీ మాథ్యూస్ 5 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్​లో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డేనియల్ వ్యాట్​.. షెఫాలీతో కలిసి స్కోరు బోర్డును ముందుకు సాగించింది.

ఈ క్రమంలోనే 34 పరుగులు చేసిన మరో ఓపెనర్​ షెఫాలీ వర్మ.. హర్లీన్ డియోల్ బౌలింగ్​లో ఔటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిథాలీ రాజ్ సహకారంతో వ్యాట్ రెచ్చిపోయింది. 46 పరుగులు చేసి రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్​లో పెవిలియన్ బాట పట్టింది షెఫాలీ.

చివరి నిమిషంలో వెలాసిటీ బ్యాట్స్​ఉమెన్​ తడబడ్డారు. వేదా కృష్ణమూర్తి, సుష్మ వర్మ, శిఖా పాండే, అమేలి కెర్.. డకౌట్​గా వెనుదిరిగారు. సుశ్రీ ప్రధాన్ 2 పరుగులు చేసింది.

ట్రైల్​బ్లేజర్స్ బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరీ గైక్వాడ్, హర్లీన్ డియోల్ తలో వికెట్ తీశారు.

అంతకు ముందు బ్యాటింగ్​ చేసిన ట్రైల్​బ్లేజర్స్ 20 ఓవర్లలో 112 పరుగులే చేయగలిగింది. సుబీ బేట్స్ 26, స్మృతి మంధాన 10, హర్లీన్ డియోల్ 43, స్టెఫానీ టేలర్ 5, భారతీ ఫుల్మలీ 2, దయాలన్ హేమలత 1, సెల్మాన్ 8, దీప్తి శర్మ 16 పరుగులు చేశారు.

వెలాసిటీ బౌలర్లలో ఏక్తాబిస్త్, అమేలి కెర్ తలో రెండు వికెట్లు తీశారు. శిఖా పాండే, సుశ్రీ ప్రధాన్ తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details