ఐపీఎల్ లీగ్ మ్యాచ్ల్లో భాగంగా శనివారం బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్కు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ను ఆర్సీబీ బౌలర్ ఉమేశ్ యాదవ్ వేశాడు. ఈ ఓవర్లో ఉమేశ్ సరైన డెలివరీ వేసినప్పటికీ అంపైర్ నోబాల్గా ప్రకటించారు. ఈ విషయం రీప్లేలో లీగల్ డెలివరీ అని తేలింది. దీనిపై ఉమేశ్ , ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోబాల్ ఎలా అవుతుందని ప్రశ్నించిన ఉమేశ్పై అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బౌలింగ్ వేయడానికి వెళ్లు అంటూ సూచించడం టీవీల్లోనూ కనిపించింది.
ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో స్టేడియంలో అంపైర్లకు కేటాయించిన రూమ్కు ఆగ్రహంతో వెళ్లిన నిగెల్ లాంగ్.. డోర్ను కాలితో గట్టిగా తన్ని ధ్వంసం చేశాడు. దీనిపై బీసీసీఐ అంతర్గత విచారణ చేపట్టినా అతడిని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అంపైరింగ్ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు లేవని తెలుస్తోంది.