తెలంగాణ

telangana

By

Published : May 8, 2019, 5:12 PM IST

ETV Bharat / sports

మహిళ టీ20 లీగ్​: మిథాలీ సేన లక్ష్యం 113

జైపుర్​ వేదికగా జరుగుతున్న మహిళా టీ20 మ్యాచ్​లో.. నిర్ణీత 20 ఓవర్లలో 112 పరుగులు చేసింది ట్రైల్​బ్లేజర్స్. హర్లీన్ డియోల్ 43 పరుగులతో ఆకట్టుకుంది.

మహిళ టీ20 లీగ్​: మిథాలీ సేన లక్ష్యం 113

జైపుర్​ వేదికగా జరుగుతున్న మహిళా టీ20 లీగ్​లో ట్రైల్​బ్లేజర్స్- వెలాసిటీ జట్లు తలపడ్డాయి. బ్లేజర్స్​కు స్మృతి మంధాన కెప్టెన్​గా, వెలాసిటీ జట్టుకు మిథాలీ రాజ్​ నాయకత్వం వహించింది.

టాస్ గెలిచిన మిథాలీ.. ప్రత్యర్థికి బ్యాటింగ్​ అప్పగించింది. సూపర్​ నోవాస్​తో జరిగిన గత మ్యాచ్​లో 90 పరుగులు చేసిన స్మృతి.. ఈరోజు 10 పరుగులకే ఔటైంది. మూడో స్థానంలో వచ్చిన హర్లీన్ డియోల్ 43 పరుగులతో ఆకట్టుకుంది.

మిగతా బ్యాట్స్​ ఉమెన్​లో సుజీ బేట్స్ 26, స్టెఫానీ టేలర్ 5, భారతీ ఫుల్మలీ 2, హేమలత 1, సెల్మన్ 8, దీప్తి శర్మ 16 పరుగులు చేశారు.

వెలాసిటీ బౌలర్లలో అమేలీ కెర్, ఏక్తా బిస్త్ తలో రెండు వికెట్లు తీశారు. సుశ్రీ ప్రధాన్, శిఖా పాండే తలో వికెట్ పడగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details