తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ

కోల్​కతాతో జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

By

Published : Mar 30, 2019, 8:03 PM IST

దిల్లీ- కోల్​కతా

కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది. దిల్లీ వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

రెండు మ్యాచ్​ల్లోనూ గెలిచి మరో విజయంపై కన్నేసింది కోల్​కతా. గత మ్యాచ్ ఓటమి నుంచి కోలుకుని ఈ మ్యాచ్​లో గెలవాలనే కసితో ఉంది క్యాపిటల్స్ జట్టు.

రెండు మ్యాచ్​ల్లోనూ ఓటమి నుంచి కోల్​కతాను ఆదుకున్న ఆండ్రి రసెల్​పైనే అందరి కళ్లు ఉన్నాయి. అటు దిల్లీలోనూ తొలి మ్యాచ్​లో విజృంభించిన పంత్​ మరోసారి బ్యాట్ ఝళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సమిష్టిగా రాణిస్తున్న ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది.

సునీల్ నరైన్​ని ఈ మ్యాచ్​కు దూరంగా ఉంచింది కోల్​కతా. మరో వైపు జట్టులో నాలుగు మార్పులు చేసింది దిల్లీ. క్రిస్ మోరిస్, హర్షల్ పటేల్​, హనుమ విహారి, సందీప్​లను జట్టులోకి తీసుకుంది. టీమ్​లో చేరిన వీరు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

జట్లు :

కోల్​కతా నైట్ రైడర్స్​:

దినేశ్ కార్తిక్(కెప్టెన్), క్రిస్ లిన్, నిఖిల్ నాయక్​, రాబిన్ ఉతప్ప, నితీశ్ రానా, ఆండ్రి రసెల్, శుభ్​మన్ గిల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ల్యూక్ ఫెర్గ్యూసన్, ప్రసిధ్ కృష్ణ

దిల్లీ క్యాపిటల్స్​:

శ్రేయస్ అయ్యర్​(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్(కీపర్), ఇంగ్రామ్, క్రిస్ మోరిస్, హర్షల్ పటేల్, హనుమ విహారి, మిశ్రా, రబాడా, సందీప్.

ABOUT THE AUTHOR

...view details