సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ ఎలెవెన్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 లక్ష్యాన్ని ఛేదించలేక 185 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో వేగంగా 3000 పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగింది బెంగళూరు. ఓపెనర్లు పార్థివ్ పటేల్ రాణించగా, కోహ్లి కేవలం 13 పరుగులే చేసి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి వరకు నిలిచి 44 బంతుల్లో 82 పరుగులు చేశాడు.
కొంత సేపటి తర్వాత 43 పరుగులు చేసిన పార్థివ్ మురుగన్ అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లో స్టాయినిస్ తప్ప మిగతా ఎవరూ డివిలియర్స్కు సహకరించలేకపోయారు. మొయిన్ అలీ 4, అక్షదీప్ నాథ్ 3 పరుగులే చేసి ఔటయ్యారు. చివరి వరకు నిలిచిన స్టాయినిస్ 46 పరుగులు చేశాడు.
పంజాబ్ బౌలర్లలో షమి, అశ్విన్, మురుగన్ అశ్విన్, విజెలిన్ తలో వికెట్ తీశారు.