తెలంగాణ

telangana

ETV Bharat / sports

సొంతగడ్డపై హ్యాట్రిక్ కొట్టిన 'బెంగళూరు' - RCB

కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 82 పరుగులు చేసిన డివిలియర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

సొంతగడ్డపై హ్యాట్రిక్ కొట్టిన 'బెంగళూరు'

By

Published : Apr 25, 2019, 12:21 AM IST

సొంతగడ్డపై పంజాబ్​ కింగ్స్​ ఎలెవెన్​తో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 లక్ష్యాన్ని ఛేదించలేక 185 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్​లో పంజాబ్​ బ్యాట్స్​మెన్​ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​లో వేగంగా 3000 పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగింది బెంగళూరు. ఓపెనర్లు పార్థివ్ పటేల్ రాణించగా, కోహ్లి కేవలం 13 పరుగులే చేసి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి వరకు నిలిచి 44 బంతుల్లో 82 పరుగులు చేశాడు.

కొంత సేపటి తర్వాత 43 పరుగులు చేసిన పార్థివ్ మురుగన్ అశ్విన్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్​లో స్టాయినిస్ తప్ప మిగతా ఎవరూ డివిలియర్స్​కు సహకరించలేకపోయారు. మొయిన్ అలీ 4, అక్షదీప్ నాథ్ 3 పరుగులే చేసి ఔటయ్యారు. చివరి వరకు నిలిచిన స్టాయినిస్ 46 పరుగులు చేశాడు.

పంజాబ్​ బౌలర్లలో షమి, అశ్విన్, మురుగన్ అశ్విన్, విజెలిన్ తలో వికెట్ తీశారు.

అనంతరం 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది పంజాబ్. ఓపెనర్లు రాహుల్, గేల్ వేగంగా ఆడారు. 3.2 ఓవర్లలోనే 42 పరుగులు చేశారు. ఆ వెంటనే 23 పరుగులు చేసిన గేల్.. ఉమేశ్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

తర్వాత మాయాంక్​తో కలిసిన రాహుల్... స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలో రెండో వికెట్​కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 9.1 ఓవర్​ వద్ద 35 పరుగులు చేసిన మయాంక్.. స్టాయినిస్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ఆ వెంటనే 42 రన్స్ చేసిన రాహుల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మిల్లర్, నికోలస్ పూరన్.. నాలుగో వికెట్​కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకానొక దశలో పంజాబ్​ మ్యాచ్​ గెలిచేలా కనిపించింది. కానీ 19 ఓవర్ వేసిన సైనీ.. మిల్లర్, పూరన్​లను ఔట్ చేశాడు. చివరి ఓవర్​ బౌలింగ్ చేసిన ఉమేశ్.. అశ్విన్, విజెలిన్​ను ఔట్ చేసి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు.

ఆర్​సీబీ బౌలర్లలో ఉమేశ్ మూడు వికెట్లు తీశాడు. సైనీ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టాయినిస్, అలీ తలో వికెట్ తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details