తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బెంగళూరు బెంగ తీరేనా.. గెలుపు పలకరించేనా!' - పంత్

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్​లో పరాజయం పాలైతే ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టమవుతాయి. మరో వైపు దిల్లీ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్నా.. కీలక సమయాల్లో చేతులెత్తేస్తోంది. ఈ రెండింటి మధ్య బెంగళూరు వేదికగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మ్యాచ్​ జరగనుంది.

RCB_DC

By

Published : Apr 7, 2019, 7:11 AM IST

వరుసగా 5 పరాజయాలు.. వెంటాడుతున్న దురదృష్టంతో దాదాపు ఖాయమనుకున్న విజయం దూరమవుతోంది రాయల్ ఛాలెంజర్స్​ జట్టుకు. ఐదింటిలో 2 మ్యాచ్​లు గెలిచి మూడో విజయం కోసం ఎదురుచూస్తోంది దిల్లీ క్యాపిటల్స్​. ఈ రెండు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ జరగనుంది.

కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు 205 పరుగులు చేసినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. రసెల్ విధ్వంసంతో భారీ లక్ష్యం చిన్నదైంది. బ్యాట్స్​మెన్, బౌలర్లు ఇద్దరిలో ఎవరో ఒకరు విఫలమవుతూ జట్టుకు పరాజయాలను మిగిలుస్తున్నారు. మరోవైపు దిల్లీ జట్టు వరుసగా 2 మ్యాచ్​ల్లో ఓడిపోయి ఈసారి గెలవాలని చూస్తోంది.

రాయల్ ​ఛాలెంజర్స్ బెంగళూరు

బెంగళూరు జట్టు సమష్టిగా రాణించడంలో విఫలమవుతుంది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్​లో బ్యాట్స్​మెన్ విఫలమవగా.. జట్టు 70 పరుగులకే ఆలౌటైంది. సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో మొదట బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకుంటే.. అనంతరం బ్యాట్స్​మెన్ చేతులెత్తేశారు. కోల్​కతా మ్యాచ్​లో అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనతో విజయం బెంగళూరు వాకిలి వరకు వచ్చి వెనుదిరిగింది. రాజస్థాన్ మ్యాచ్​లోనూ ఆర్సీబీ టాప్​ఆర్డర్​ రాణించక.. విజయాన్ని రాయల్స్​కి అప్పగించింది.

ఆర్సీబీ బౌలర్లలో చాహల్, పవన్​ నేగి మినహా మిగతా వాళ్లు పెద్దగా రాణించట్లేదు. బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారని బెంగళూరు కెప్టెన్ కోహ్లీ కూడా కోల్​కతాతో మ్యాచ్​ అనంతరం తెలిపాడు. ఇప్పటికే 5 మ్యాచ్​ల్లో ఓడిపోయిన బెంగళూరు మరో మ్యాచ్​లో ఓడితే ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యే ప్రమాదముంది.

దిల్లీ క్యాపిటల్స్​

జట్టు సమతూకంగా ఉన్నప్పటికీ నిలకడ లేమితో విఫలమవుతుంది. ఆడిన ఐదింటిలో మూడు మ్యాచ్​ల్లో ఓడిపోయింది. శిఖర్ ధావన్, రిషభ్ పంత్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, ఇంగ్రామ్​లతో టాప్​ఆర్డర్ బలంగా ఉంది. రబాడ, బౌల్ట్, ఇషాంత్ శర్మలతో పేస్ దళం పటిష్ఠంగా ఉంది. స్పిన్​లో సందీప్, అమిత్​ మిశ్రాలు నిలకడగా రాణిస్తున్నారు. అయినప్పటికీ కీలక సమయాల్లో చేతులెత్తేస్తోంది దిల్లీ జట్టు.
పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 8 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది. కోల్​కతాతో మ్యాచ్​లో సూపర్​ ఓవర్లో మ్యాచ్​ గెలిచినప్పటికీ చివరి వరకు తెచ్చుకుంది.

జట్ల అంచనా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్(వికెట్​ కీపర్​), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్మైర్, స్టాయినిస్​, అక్షదీప్ నాథ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, మహమ్మద్ సిరాజ్, టిమ్ సౌథీ.

దిల్లీ క్యాపిటల్స్:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, పంత్, ధావన్, హర్షల్ పటేల్, ఇషాంత్, రబాడ, సందీప్, బౌల్ట్, క్రిస్ మోరిస్, కొలిన్ ఇంగ్రామ్​

ABOUT THE AUTHOR

...view details