తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ జట్టుకు షాక్- స్వదేశానికి రబాడ పయనం

దిల్లీ క్యాపిటల్స్​కు ఊహించని షాక్​ తగిలింది. పేసర్​ కగిసో రబాడ ఐపీఎల్​ను వీడాడు. గాయం కారణంగా చెన్నైతో మ్యాచ్​కు దూరమైన రబాడ... తాజాగా స్వదేశానికి పయనమయ్యాడు.

By

Published : May 3, 2019, 2:16 PM IST

Updated : May 3, 2019, 2:54 PM IST

దిల్లీ జట్టుకు షాక్​... స్వదేశానికి రబాడా

వెన్నునొప్పితో బాధపడుతున్న దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు కగిసో రబాడ నేడు దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. ప్రపంచకప్​ దృష్ట్యా ముందు జాగ్రత్తగా స్వదేశానికి రావాలని రబాడను వెనక్కి పిలిచింది దక్షిణాఫ్రికా బోర్డు.

'ప్లేఆఫ్​ మ్యాచ్​లకు ముందు దిల్లీ క్యాపిటల్స్​ను వీడి వెళ్తుండటం చాలా కష్టంగా ఉంది. కానీ ప్రపంచకప్​ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. అందుకే బోర్డు స్వదేశానికి రమ్మని పిలిచింది. కొద్దిరోజుల్లోనే దిల్లీ జట్టుతో మంచి అనుబంధం ఏర్పడింది. కచ్చితంగా మా జట్టు ఐపీఎల్​ ట్రోఫీ గెలుస్తుందని నమ్మకముంది.'
-- రబాడ, దిల్లీ క్యాపిటల్స్​ పేసర్​

'దిల్లీని ఇలాంటి పరిస్థితిలో వదిలి... రబాడ వెళ్లిపోతాడని అసలు ఊహించలేదు. అయితే జట్టంతా కప్పు గెలవాలని పట్టుదలతో ఉన్నారు. అందరూ సమష్టి ప్రదర్శనతో జట్టును మరింత ముందుకు తీసుకెళ్తారు.'
-- రికీ పాంటింగ్​, దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​

ఐపీఎల్​లో 12 మ్యాచ్​లు ఆడిన రబాడ 25 వికెట్లు తీసి పర్పుల్​ క్యాప్​తో కొనసాగుతున్నాడు. దిల్లీ 7 సంవత్సరాల తర్వాత ప్లేఆఫ్​కు చేరడంలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. దిల్లీ తర్వాత లీగ్​ మ్యాచ్​ను.. శనివారం ఫిరోజ్​షా కోట్లా మైదానంలో రాజస్థాన్​ రాయల్స్​తో ఆడనుంది.

Last Updated : May 3, 2019, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details