తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్​

ఫిరోజ్​ షా కోట్లా వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్నాడు దిల్లీ సారథి శ్రేయస్​ అయ్యర్​.

By

Published : Apr 20, 2019, 8:04 PM IST

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్​

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు. మంచు వల్ల ఔట్​ ఫీల్డ్ కొంచెం ​తడిగా ఉంది. తుదిజట్టులో 3 మార్పులు చేసింది దిల్లీ. ఇంగ్రామ్​, లామిచన్నే, రూథర్​ఫోర్డ్​ జట్టులోకి వచ్చారు.

ఒకవేళ టాస్​ గెలిస్తే పంజాబ్​ కూడా బౌలింగ్​ ఎంచుకునేదని సారథి అశ్విన్​ వెల్లడించాడు. పంజాబ్​ జట్టులో చిన్న మార్పు చేసింది. లెఫ్టార్మ్​ స్పిన్నర్​ హర్​​ప్రీత్ ఈ మ్యాచ్​లో ఆడనున్నాడు.

దిల్లీ, పంజాబ్​ జట్లు

ఇరుజట్లు ఐదేసి విజయాలతో పది పాయింట్లతో సమంగా ఉన్నాయి. దిల్లీ కొంచెం మెరుగైన రన్​రేట్​ కారణంగా మూడో స్థానంలో కొనసాగుతోంది.

పాయింట్ల పట్టిక

ABOUT THE AUTHOR

...view details