తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వీలైతే ధోనిని ప్రధాన మంత్రిని చేసేద్దాం'

బెంగళూరుతో మ్యాచ్​లో చెలరేగి ఆడిన ధోనిపై ట్విట్టర్​ వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. వీలైతే అతడ్ని దేశానికి ప్రధాన మంత్రిని చేసేద్దాం అంటూ ట్వీట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

By

Published : Apr 22, 2019, 1:43 PM IST

'వీలైతే ధోనిని ప్రధాన మంత్రిని చేసేద్దాం'

ప్రపంచకప్​ సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి తన బ్యాటు పవర్ చూపించాడు ధోని. ఆదివారం ఐపీఎల్​లో బెంగళూరుతో మ్యాచ్​లో 84 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. గెలవాల్సిన మ్యాచ్​ను ఒక్క పరుగు తేడాతో ఓడింది చెన్నై. అనంతరం సామాజిక మాధ్యమాల్లో విభిన్నంగా స్పందించారు నెటిజన్లు. మహేంద్ర సింగ్​ ధోనిని దేశానికి ప్రధాన మంత్రిని చేసేద్దాం అంటూ సరదాగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ అతడు ఎన్నికల్లో పోటీ చేస్తే నా ఓటు ధోనికే అని చెపుతున్నారు.

ధోనిని ప్రధానిని చేసేద్దాం అంటూ ట్వీట్ల వర్షం
ధోనిని ప్రధానిని చేసేద్దాం అంటూ ట్వీట్ల వర్షం
ధోనిని ప్రధానిని చేసేద్దాం అంటూ ట్వీట్ల వర్షం
ధోనిని ప్రధానిని చేసేద్దాం అంటూ ట్వీట్ల వర్షం

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్​కు దిగిన ధోని.. చివరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. కానీ అభిమానుల మనసును గెలుచుకున్నాడు.

ఇది చదవండి: ధోనిని చూసి కోహ్లీ ఎందుకు భయపడ్డాడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details