ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ - చెన్నై సూపర్కింగ్స్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్కు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికైంది. టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సరాసరి ఫైనల్కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఓడిన జట్టు.. దిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య బుధవారం విశాఖపట్టణంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడుతుంది.
ఈ స్టేడియంలో 7 మ్యాచుల్లో ఇరుజట్లు తలపడగా... ముంబాయి 5, చెన్నై2 విజయాలు సాధించాయి. ఈ సీజన్లో చెన్నైని సొంతగడ్డపై ఓడించిన ఏకైక జట్టు ముంబయే.
- చెన్నై ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ధ్రువ్ షోరే బదులుగా మురళి విజయ్కు స్థానం లభించింది.
- ముంబయి ఒక్క మార్పుతోనే పోటీకి దిగుతోంది. మెక్లెనగన్ స్థానం కోల్పోగా జయంత్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్: