తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోని, జడ్డూకు ఫీవర్- అభిమానులకు ఫియర్!

భారత ఆటగాళ్లు ధోని, జడేజా అనారోగ్యంగా ఉన్నారని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్​ ఫ్లెమింగ్ చెప్పాడు. ప్రపంచకప్​ దగ్గర పడుతున్న తరుణంలో ఇద్దరు ఆటగాళ్లకు ఇలా జరగడం అభిమానులను కలవరపెడుతోంది.

By

Published : Apr 27, 2019, 1:21 PM IST

ధోనీ - జడేజా

ధోని, జడేజాకు ఆరోగ్యం బాగా లేదని చెన్నై సూపర్​ కింగ్స్​ కోచ్ స్టీఫెన్​ ఫ్లెమింగ్ చెప్పాడు. ఇద్దరూ వైరల్ జ్వరం బారిన పడ్డారని తెలిపాడు. ప్రపంచకప్​ దగ్గర పడుతున్న తరుణంలో భారత అభిమానులకు ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ముంబయితో జరిగిన మ్యాచ్​కు మహీ దూరమైన విషయం తెలిసిందే. తర్వాత మ్యాచ్​లకు వీరు అందుబాటులో ఉంటారన్న విషయంపై స్పష్టత లేదు.

"ధోని, జడేజా వైరల్​ జ్వరంతో బాధపడుతున్నారు. మిగతా జట్లలోని ఆటగాళ్లూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఐదు రోజుల విరామం తర్వాత బరిలోకి దిగిన ముంబయి చక్కటి ప్రదర్శన చేసింది. తర్వాత మ్యాచ్​కు మాకు నాలుగు రోజుల బ్రేక్​ ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మిడిల్ ​ఆర్డర్​లో ధోని స్థానాన్ని పూడ్చలేనప్పటికీ.. మంచి ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం" - ఫ్లెమింగ్, చెన్నై కోచ్

ఈ సీజన్​లో ధోని లేకుండా ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఇంతకు ముందు సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​తో పాటు తాజాగా ముంబయి చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్​లో ఏడు ఇన్నింగ్స్​ ఆడిన ధోని 314 పరుగులు చేశాడు. 100కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్​ వేదికగా మే 30న ప్రపంచకప్​ ప్రారంభంకానుంది. ఈ సమయంలో వరల్డ్​కప్​ జట్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు అనారోగ్యం పాలవడం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఇంతకుముందు బుమ్రాకు భుజం గాయమైంది. అయితే ఈ పేసర్ వెంటనే కోలుకుని మళ్లీ ఐపీఎల్​లో సత్తాచాటుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details