తెలంగాణ

telangana

చిదంబరం స్టేడియంలో సగమే ఎందుకని..??

By

Published : Apr 6, 2019, 9:50 PM IST

దేశంలోని పురాతన స్టేడియాలలో చెన్నైలోని ఎమ్​ఏ చిదంబరం స్టేడియం ఒకటి. దీనినే చెపాక్​ స్టేడియం అని పిలుస్తుంటారు. 1916లో నిర్మించిన ఈ మైదానం ఎన్నో టెస్టులు, వన్డేలు, టీ20లు, ఐపీఎల్​ మ్యాచ్​లకు వేదికైంది. అయితే ఇందులో నిర్వహించిన మ్యాచుల్లో ఒకవైపు మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తారు మిగతా సగం ఖాళీగా ఉంటుంది.. ఎందుకు..?

చిదంబరం స్టేడియంలో సగమే ఎందుకని..??

తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్ ​(టీఎన్​సీఏ) ఆధ్వర్యంలో నడుస్తోన్న చిదంబరం స్టేడియం దేశంలోని పాత స్టేడియాలలో ఒకటి. అయితే ఇందులో 50 వేల మంది కూర్చుని వీక్షించే అవకాశం ఉన్నా...38వేల మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.

  • ఏంటి కారణం..??

ఈ స్టేడియంలో మూడు స్టాండ్​లు(ఐ, జే, కే) ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. ఈ మూడింటి సామర్థ్యం 12 వేల సీట్లు. ఒక్కొక్కటి 4వేల సామర్థ్యం కలవి. అయితే 2011 నవంబరు నుంచి ఈ స్టాండ్​లలో ప్రవేశం నిషేధించారు. చెపాక్​ స్టేడియం నిర్మించే సమయంలో అనుమతులు లేకుండా స్టాండ్లను కలుపుతూ వ్యాయామశాల నిర్మించింది మద్రాసు క్రికెట్​ క్లబ్. అయితే ఇది చట్టవిరుద్ధంగా నిర్మాణం జరిగిందని టీఎన్​సీఏ పై కేసు సైతం నమోదైంది. ఆ తీర్పులో భాగంగా మద్రాసు హైకోర్టు ఈ స్టాండ్​ల వాడకంపై స్టే విధించింది. ఇదే వివాదంపై టీఎన్​సీఏ పై 2013లో క్రిమినల్​ కేసు సైతం ఉంది.

  • ఇప్పటికీ రాలేదు...

ఆయా స్టాండ్​లను పడగొట్టాలని 2015లో సుప్రీంకోర్టు తమిళనాడు క్రికెట్​ సంఘానికి ఆదేశాలిచ్చింది. టీఎన్​సీఏ వీటి నిర్మాణంపై ప్రణాళిక తయారుచేసి చెన్నై మున్సిపల్​ కార్పొరేషన్​కు అందజేయాలని సూచించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను టీఎన్​సీఏ స్వాగతించినా నిర్మాణానికిి కావలసిన అనుమతులు ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇది పురాతన స్టేడియం కావడంతో పడగొట్టి కొత్తగా నిర్మించేందుకు ఆ రాష్ట్ర పురావస్తు శాఖ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details