ఐపీఎల్-12వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు 203 పరుగులే చేయగలిగింది కోల్కతా.
రాణా, రస్సెల్ బీభత్సం
214 పరుగుల భారీ లక్ష్యం... డేల్ స్టెయిన్ లాంటి బౌలర్ జట్టులో ఉండటం.. ఇంకేమి ఆర్సీబీ విజయానికి అడ్డేమి లేదనుకుంది కోహ్లీ సేన. కాని కోల్కతాను ఈ సీజన్లో పరుగులెత్తిస్తున్న హిట్టర్ ఆండ్రూ రస్సెల్ (65: 25 బంతుల్లో 2ఫోర్లు, 9సిక్సర్లు) మరోసారి విశ్వరూపం చూపించాడు. అతడికి తోడు నితీశ్ రాణా (85: 46 బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు) విజృంభించాడు. వీరద్దరి ముందు భారీ లక్ష్యం చిన్నబోయింది. చివరి ఓవర్లో 24 పరుగులు కొట్టాల్సిన సమయంలో బంతి అందుకున్న స్పిన్నర్ మొయిన్ అలీ.. కోల్కతా విజయాన్ని అడ్డుకున్నాడు.
బెంగళూరు బౌలర్లలో స్టెయిన్ రెండు, సైనీ, స్టాయినిస్ తలో వికెట్ తీశారు.