తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన డివిలియర్స్.. ముంబయి లక్ష్యం 172

వాంఖడేలో జరుగుతున్న ఐపీఎల్​ మ్యాచ్​లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 171 పరుగులు చేసింది. బౌలర్లలో మలింగకు 4 వికెట్లు దక్కాయి.

By

Published : Apr 15, 2019, 9:58 PM IST

డివిలియర్స్ రాణించన వేళ..ముంబయి లక్ష్యం 172

వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. డివిలియర్స్ 74 పరుగులతో రాణించాడు. ముంబయి బౌలర్లలో మలింగకు 4 వికెట్లు దక్కాయి.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్​లో ఆకట్టుకున్న కోహ్లి.. నేడు 8 పరుగులే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్​ పార్థివ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 28 పరుగులు చేసి రెండో వికెట్​గా వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ..డివిలియర్స్​తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్​కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ క్రమంలోనే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

50 పరుగులు చేసిన అలీ... మలింగ బౌలింగ్​లో ఔటయ్యాడు. 75 పరుగులు చేసిన డివిలియర్స్.. మలింగ వేసిన చివరి ఓవర్లో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షదీప్ నాథ్, పవన్ నేగి​ వెంట వెంటనే వెనుదిరిగారు.

ముంబయి బౌలర్లలో మలింగకు నాలుగు వికెట్లు, బెరెండార్ఫ్​, హార్దిక్ పాండ్యకు తలో వికెట్ దక్కింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details