తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2021, 5:41 PM IST

ETV Bharat / sports

INDVSENG Lunch: పరుగుల కోసం చెమటోడుస్తున్న భారత్

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టు మూడో రోజు లంచ్ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఇంకా 320 పరుగుల వెనుకంజలో ఉంది.

rohit
రోహిత్

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భారత్ ఆచితూచి ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లీష్ జట్టు 432 పరుగులు చేయడం వల్ల వారికి 354 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు రోహిత్ (25*), రాహుల్ (8) శుభారంభాన్ని అందించడానికి కృష్టి చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు స్వింగ్, బౌన్స్​తో ఇబ్బంది పెడుతున్నా.. ఓపికతో ఆడుతూ స్కోర్ బోర్డును కదిలించారు. ఈ క్రమంలోనే లంచ్ సమయానికి ముందు రాహుల్​ను బోల్తా కొట్టించాడు ఓవర్టన్. దీంతో 34 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది కోహ్లీసేన. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఇంకా 320 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇక, ఓవర్‌నైట్‌ స్కోరు 423/8తో మూడో రోజు ఆట ఆరంభించిన రూట్‌ సేన మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. క్రెయిగ్ ఓవర్టన్‌ (32; 42 బంతుల్లో 6×4) షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఆటగాడు రాబిన్సన్‌ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. దీంతో మరో 9 పరుగులు చేసి 432 పరుగులకు ఆలౌటైంది ఇంగ్లాండ్.

ఇవీ చూడండి: INDvsENG: రూట్ సెంచరీల జోరు.. రికార్డుల హోరు!

ABOUT THE AUTHOR

...view details