తెలంగాణ

telangana

ETV Bharat / sports

పురుషుల క్రికెట్​లో... మహిళా అంపైర్​

ఆస్ట్రేలియాకు చెందిన క్లేర్​ పోలోసాక్.. పురుషుల వన్డే క్రికెట్​ మ్యాచ్​కు అంపైరింగ్​ చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఐసీసీ వరల్డ్​ క్రికెట్ లీగ్​లో నేడు జరుగుతున్న మ్యాచ్​కు అంపైర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

By

Published : Apr 27, 2019, 6:17 PM IST

అంపైర్

పురుషుల అంతర్జాతీయ క్రికెట్​ మ్యాచ్​కు అంపైరింగ్​ చేసిన తొలిమహిళగా చరిత్ర సృష్టించారు ఆస్ట్రేలియాకు చెందిన క్లేర్​ పోలోసాక్​. నేడు ఐసీసీ వరల్డ్​ క్రికెట్ లీగ్​లో ఒమన్ - నమీబియా మధ్య జరుగుతున్న మ్యాచ్​లో క్లేర్ అంపైరింగ్​ చేస్తున్నారు.

"పురుషుల వన్డే క్రికెట్​లో అంపైరింగ్​ చేయబోతున్నందుకు ఎంతో థ్రిల్​గా ఉంది. క్రికెట్​లో మహిళలు అంపైరింగ్ చేయకపోవడానికి కారణమేంటో నాకు తెలియదు. స్త్రీలలో దీనిపై అవగాహన తీసుకురావాలి" అని మ్యాచ్​కు ముందు క్లేర్ చెప్పారు.

నవంబరు 2016లో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన మ్యాచ్​లో తొలిసారి అంపైరింగ్ చేశారు క్లేర్. ఇప్పటివరకు 16 వన్డేల్లో... మ్యాచ్​ పర్యవేక్షకురాలి బాధ్యతలు నిర్వర్తించారు. 2018 మహిళా టీ 20 ప్రపంచకప్​ సెమీ ఫైనల్​ మ్యాచ్​, 2017 మహిళల ప్రపంచకప్​లోనూ అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు క్లేర్​.

ABOUT THE AUTHOR

...view details