టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మకు గాయం అయిందన్న వార్తల్లో కచ్చితత్వం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నారు. ముంబయి జట్టు కోసం రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు వైరల్గా మారటం వల్ల ఈ వ్యాఖ్యలు చేశారు గావస్కర్.
" రోహిత్ ప్రాక్టీస్ చేస్తుంటే అతనికి ఎలాంటి గాయం అయ్యిందో అర్థం కావట్లేదు. నిజంగానే అతనికి తీవ్రమైన గాయం ఉంటే అసలు బ్యాట్ పట్టుకునేవాడే కాదు. రోహిత్కు గాయం అయ్యిందన్న వార్తల్లో కచ్చితత్వం లేదు. భారత క్రికెట్ అభిమానుల్లో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి."