తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడో టీ20కి పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు అనుమతి

టీ20ల్లో ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమవుతోంది భారత్. ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్​ వీక్షించేందుకు ప్రేక్షుకులకు పూర్తి స్థాయిలో అనుమతి లభించింది.

By

Published : Dec 3, 2020, 6:01 AM IST

IND vs AUS T20
మూడో టీ20కి పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు అనుమతి

భారత్,ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20కి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 7 నుంచి న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం కరోనా నిబంధనల్లో సడలింపు ఇవ్వడమే ఇందుకు కారణం.

కరోనా వ్యాప్తి కారణంగా వన్డే సిరీస్​ మ్యాచ్​లు చూసేందుకూ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అనుమతి లభించలేదు. కానీ, డిసెంబర్​ 7న సిడ్నీ వేదికగా జరిగే చివరి టీ20కి పూర్తి స్థాయిలో ప్రేక్షకులు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.

వన్డే సిరీస్​లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో భారత్​పై గెలిచింది. శుక్రవారం నుంచి టీ20 మ్యాచ్​లు ఆడేందుకు సిద్ధమైంది. మొదటి టీ20 మ్యాచ్ కాన్​బెర్రాలోని మనుకా ఓవెల్​ వేదికగా జరగనుంది.

ఇదీ చదవండి:వన్డే సూపర్​ లీగ్​లో ఖాతా తెరిచిన టీమ్​ఇండియా

ABOUT THE AUTHOR

...view details