తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2020, 9:07 PM IST

Updated : Dec 30, 2020, 9:15 PM IST

ETV Bharat / sports

రోహిత్​.. చాలా నాజూగ్గా కనిపిస్తున్నావు: శాస్త్రి

భారత స్టార్ ​బ్యాట్స్​మన్​ రోహిత్​ శర్మకు తన సహచరులు​ ఘన స్వాగతం పలికారు. సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న రోహిత్​.. బుధవారం మెల్​బోర్న్​లోని టీమ్ఇండియా శిబిరంలో చేరాడు.

Rohit Sharma joins Indian squad ahead of third Test vs AUS
టీమ్ఇండియాతో రోహిత్ శర్మ.. జట్టులో జోష్

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ క్వారంటైన్‌ ముగిసింది. బుధవారం రాత్రి అతడు జట్టుతో కలిశాడు. జట్టు హోటల్‌కు చేరుకున్న అతడికి సహచరులు, కోచింగ్‌ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఒకర్నొకరు హత్తుకుంటూ అభినందనలు తెలియజేసుకున్నారు. కోచ్‌ రవిశాస్త్రి అయితే క్వారంటైన్‌ తర్వాత నాజూగ్గా కనిపిస్తున్నావని పలకరించడం గమనార్హం.

ఫిట్‌నెస్‌ పరీక్ష నెగ్గి కొన్నిరోజుల క్రితం ఆస్ట్రేలియాకు చేరుకున్న రోహిత్‌శర్మ సిడ్నీలో క్వారంటైన్‌ అయ్యాడు. అక్కడ కరోనా వైరస్‌ కేసులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రవేశాలపై ఆంక్షలు ఉన్నాయి. దాంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోహిత్‌ 14 రోజులు రెండు గదుల భవంతిలో ఏకాంతవాసంలో ఉన్నాడు. క్వారంటైన్‌ ముగియడం వల్ల బుధవారం జట్టుతో అధికారికంగా కలిశాడు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి రోహిత్‌ను పలకరించారు.

తొలుత టీమ్ఇండియా సహాయ సిబ్బంది రోహిత్‌కు స్వాగతం పలికారు. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్ రాఠోడ్‌ అతడితో చేయి కలిపాడు ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, చెతేశ్వర్‌ పుజారా, మయాంక్‌ అగర్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తదితరులు అతడికి స్వాగతం పలికారు. ఈ క్రమంలో రోహిత్‌ అక్కడే కూర్చున్న జస్​ప్రీత్​ బుమ్రా వెన్ను తట్టాడు. చివరగా కోచ్‌ రవిశాస్త్రి వచ్చి.. 'మిత్రమా.. నీ క్వారంటైన్‌ ఎలా గడిచింది? చాలా నాజూగ్గా (యువకుడు) కనిపిస్తున్నావ్‌' అని ప్రత్యేకంగా అన్నాడు. మెల్‌బోర్న్‌ టెస్టు గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయడంలో టీమ్‌ఇండియా జోష్‌లో కనిపించింది.

ఇదీ చూడండి:అడల్ట్​ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టెన్నిస్​ స్టార్​!

Last Updated : Dec 30, 2020, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details