తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2020, 9:19 PM IST

Updated : Dec 16, 2020, 10:31 AM IST

ETV Bharat / sports

పింక్​ టెస్టు​కు ముందు భారత ఆటగాళ్ల సరదా డ్రిల్

ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమ్​ఇండియా సన్నద్ధమవుతోంది. గురువారం మ్యాచ్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లు సరదాగా డ్రిల్ చేశారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో షేర్ చేసింది.

India team indulge in fun drill to get charged up before nets
డే-నైట్​ టెస్టుకు ముందు భారత జట్టు సరదా డ్రిల్

ఆస్ట్రేలియాతో జరగనున్నటెస్టు సిరీస్​కు టీమ్​ఇండియా సన్నద్ధమవుతోంది. ఇటీవలే రెండు ప్రాక్టీస్​ మ్యాచ్​లు ఆడిన భారత జట్టు మంగళవారం.. అడిలైడ్​ ఓవల్​ మైదానంలో ప్రాక్టీస్ చేసింది. ఆటగాళ్లు ప్రాక్టీస్​ సెషన్​లో భాగంగా.. ఒకరినొకరు తోసుకోవడం, ఎదురెదురుగా మోకాళ్లపై కూర్చోవడం, క్యాచ్​లు పట్టడం వంటి డ్రిల్ హాస్యాస్పదంగా సాగింది.

"నెట్​ సెషన్​కు ముందు భారత ఆటగాళ్లు ఇలా సరదాగా డ్రిల్ చేశారు" అని బీసీసీఐ ట్వీట్​ చేసింది. పింక్ బాల్ టెస్టుకు ముందు ఆటగాళ్లలో ఒత్తిడి తగ్గించేందుకు ఈ విధంగా చేసినట్లు పేర్కొంది. ​

ఇదీ చదవండి:'జట్టు తుది కూర్పుపై నిర్ణయం తీసుకోలేదు'

Last Updated : Dec 16, 2020, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details