తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2020, 12:48 PM IST

ETV Bharat / sports

భారత్​తో సిరీస్​ల కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

భారత్​తో ఆడే వన్డే, టీ20 జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇందులో యువ క్రికెటర్​ గ్రీన్​కు అవకాశమిచ్చారు. నవంబరు 27 నుంచి జనవరి 19 మధ్య ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

Australia squad
ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లను ప్రకటించిన క్రికెట్ బోర్ట్

స్వదేశంలో టీమ్​ఇండియాతో ఆడే సిరీస్​ల పరమిత ఓవర్ల సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు. అరోన్​ ఫించ్​ కెప్టెన్​గా కొనసాగుతాడని చెప్పి, మొత్తంగా 18 మంది బృందాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొంది.

కుర్రాళ్లకు అవకాశం..

ఇప్పటివరకు 9 లిస్ట్ ఏ మ్యాచ్​లు, 13 టీ20​లు ఆడిన 21 ఏళ్ల యువ ఆటగాడు కామెరున్ గ్రీన్​ను ఎంపిక చేసింది ఆస్ట్రేలియా. దేశవాళీ​ క్రికెట్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసి, ఈ అవకాశం దక్కించుకున్నాడు గ్రీన్.

అస్ట్రేలియా వన్డే, టీ20 జట్టు:అరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్(వైస్ కెప్టెన్), కామెరున్ గ్రీన్, జోష్ హేజిల్​వుడ్, మోయిసెస్ హెన్రిక్స్, లబుషేన్, గ్లెన్ మాక్స్​వెల్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్​సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

ఇదీ చదవండి:కేఎల్ రాహుల్​కు ప్రమోషన్.. ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టిదే

ABOUT THE AUTHOR

...view details